ఏటీఎం కార్డు సైజులో రేషన్ కార్డులు... ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Andhra Pradesh to Issue ATM Card Sized Ration Cards
- కొత్త రకం రేషన్ కార్డులు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం
- ఈ-కేవైసీ పూర్తయ్యాక కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న మంత్రి నాదెండ్ల
- నేటి నుంచి దీపం-2 రెండో విడత సిలిండర్ బుకింగ్
రేషన్ కార్డులపై ఏపీలోని కూటమి ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ కార్డులు ఏటీఎం కార్డు సైజులోనే వస్తాయని రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఇందులో కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డులకు ఆప్షన్లు ఉంటాయని మంత్రి వివరించారు. క్యూఆర్ కోడ్, ఇతర సెక్యూరిటీ ఫీచర్లతో ఈ కొత్త రేషన్ కార్డులు రూపొందిస్తున్నట్టు తెలిపారు.
నేటి నుంచి దీపం-2 రెండో విడత సిలిండర్ బుకింగ్
దీపం-2 పథకంలో ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు.
జూన్ నుంచి మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యం
జూన్ నుంచి మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యం సరఫరా చేస్తామని తెలిపారు.
మొత్తం 16 వేల మంది రైతులు వాట్సాప్ ద్వారా ధాన్యం అమ్మకం సదుపాయాన్ని వినియోగించుకున్నారని మంత్రి వెల్లడించారు.
0 Comments